Thursday, May 16, 2024

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద – ‘ఆర్ ఆర్ ఆర్’ టీం

దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు ఆ చిత్ర యూనిట్. కాగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ గుజ‌రాత్ లోని కెవాడియాకి వ‌చ్చారు.అక్కడి సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్)ని సందర్శించారు. ఆర్ఆర్ఆర్ టీం రాకతో అక్కడ కూడా సందడి నెలకొంది. మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దాంతో రాజమౌళి, చరణ్, తారక్ తమ చిత్రం గురించి వారికి వివరించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ బరోడా ఎయిర్ పోర్టు నుంచి కెవాడియా వెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలను ఉపయోగించారు. ఆ కార్లపై ఆర్ఆర్ఆర్ పేరు, రిలీజ్ డేట్, హీరోల ముఖ చిత్రాలు ముద్రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement