Friday, May 3, 2024

AP | ఫ్రెండ్స్ మ‌ధ్య గొడ‌వ‌లు.. ఇయ‌ర్ బ‌డ్స్ కోస‌మే చంపేశారు..

విజయవాడ సమీపంలోని పెనమలూరు వద్ద అజయ్ సాయి అనే యువకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. స్నేహితులే అతడిని చంపేశారు. అయితే.. ఇది గంజాయి మత్తులో జరిగిన దారుణం అని సోష‌ల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వివరణ ఇచ్చారు. యువకుడి హత్య కేసు వివరాలను ఇవ్వాల (మంగ‌ళ‌వారం) మీడియాకు వెల్లడించారు.

ఇయర్ బడ్స్ విషయంలోనే అజయ్ సాయి హత్య జరిగిందని సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. అజయ్ సాయిపై స్నేహితులే దాడి చేశారని వివరించారు. హత్య జరిగినప్పుడు నిందితులు గంజాయి మత్తులో లేరని సీపీ స్పష్టం చేశారు. హత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం నాలుగు బృందాలతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు వెల్లడించారు. నిందితులపై గతంలోనూ కేసులున్నాయని సీపీ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement