Saturday, April 20, 2024

నీల‌కంఠ కొత్త సినిమా స‌ర్కిల్….

గతంలో ‘షో’ అనే సినిమాతో జాతీయ పురస్కా రాలు అందుకున్న దర్శకుడు నీలకంఠ. ఆ తర్వాత మిస్సమ్మ, సదా మీ సేవలో చిత్రాలతో ఆకట్టు-కున్నా రు. ఇప్పుడు మరోసారి ‘సర్కిల్‌’ అనే చిత్రంతో వస్తు న్నారు నీలకంఠ. ఈ చిత్రానికి ”ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవు లవుతారో?” అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ చిత్ర -టైటిల్‌ తో పాటు- మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ మోషన్‌ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ఒక మోడల్‌ ఫోటో కెమెరా లెన్స్‌ తిరుగుతుండగా.. దానితో పాటు- ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్‌తో పూర్తవుతుంది. ఆరా ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ సర్కిల్‌ చిత్రంలో నటీ-నటు-లు సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: రంగనాథ్‌ గోగినేని సంగీతం : ఎన్‌.ఎస్‌ ప్రశు, నిర్మాతలు : ఎమ్‌.వి శరత్‌ చంద్ర, టి సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ.

Advertisement

తాజా వార్తలు

Advertisement