Sunday, May 19, 2024

ఉద్యోగాలు కొన‌సాగించ‌మంటే అరెస్ట్ చేస్తారా…..

కర్నూల్ – ఆరు నుంచి ఏడు ఏళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులను కొనసాగించాలని కోరుతూ న‌గ‌రంలోని డీఈఓ ఆఫీస్ ముందు బేటాయించారు ఉపాధ్యాయులు . వారికి మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ భాష ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా నగర అధ్యక్షులు అమర్ మాట్లాడుతూ కేజీబీవీలో గత ఏడు సంవత్సరాల నుంచి పని చేస్తున్న వారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.తక్షణమే కౌన్సిలింగును ఆపేసి కేజీబీవీ గెస్ట్ ఫ్యాకల్టీనీ కొనసాగించాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు .

కాగా, డీఈఓ బయటికి వచ్చి వీరిని తొలగించకుండా హామీ ఇవ్వాలని కోరితున్న వారిని మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement