Tuesday, May 7, 2024

Medak : ఎక్సెల్, ఆటో ఢీ.. దంపతుల దుర్మరణం

కౌడిపల్లి, జూన్ 22 ప్రభ న్యూస్ : ఆటో ఎక్సెల్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని అంతారం గేటు సమీపాన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మెదక్ మండలం గడుమన్ పల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు జక్కుల యాదగిరి, యాదమ్మ లు ఎక్సెల్ పై రాగా.. అంతరం గేట్ సమీపాన ఆటోను ఢీకొనడంతో యాదగిరి, యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి చేరుకొని వివరాలు సేకరించడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement