Monday, April 29, 2024

కౌలు రైతును బలిగొన్న రుణ భారం

నంద్యాల (పాములపాడు. రూరల్) – అప్పుల బాధతో కౌలు రైతు చాకలి సాంబశివుడు (37) ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాములపాడు ఏ. ఎస్ .ఐ యేసయ్య తెలిపిన వివరాల మేరకు పాములపాడు మండలం భానుముక్కల గ్రామానికి చెందిన చాకలి సాంబశివుడు గత మూడు సంవత్సరాలుగా పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. వరుసగా పంట సరిగా రాక దాదాపుగా 5 లక్షల అప్పు కావడంతో అప్పుతో భయపడి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య వెంకట లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏ ఎస్ ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement