Monday, April 29, 2024

పవన్ కల్యాణ్ మూవీకి దర్శకత్వం చేయను అంటే చేయను – రాంగోపాల్ వర్మ

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – తాను పక్కా వైయస్ జగన్ అభిమానిని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఏ పార్టీని గాని ఏ వ్యక్తిని గాని దూషించే తత్వం తనది కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఏంటనే విలేకరుల ప్రశ్నించగా దర్శకత్వం చేయాలంటే చేయనని తెగేసి చెప్పారు

. వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పూర్తి రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మల్‌, మాసన కీలక పాత్రధారులుగా దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ ఆదివారం ప్రకాశం బ్యారేజిపై చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడతూ వైయస్‌ మరణం దగ్గర నుంచి ‘వ్యూహం’ కథ మొదలవుతుందని చెప్పారు. రెండు భాగాలుగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.

‘‘వైయస్‌ మరణం తరువాత పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా వేశారో ఇందులో చెబుతాం అన్నారు. వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉందన్నరు. ఆ హత్య కేసులో నిందితులను చూపిస్తా. భారతీ రెడ్డిని నేను దగ్గరి నుంచి చూశా అన్నారు. జగన్‌తో పాటు భారతి పాత్ర కూడా ఉంటుందన్నారు. ఎవరేమి సినిమాలు తీసినా నాకు అనవసరం లేదన్నారు. నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూ లో సినిమా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి అన్నారు. అందులో ప్రధాన ఘట్టాలు సినిమాలో ఉన్నాయి యన్నారు.. నేను జగన్‌కు అభిమానిని, కానీ ఎవరి పైనా నాకు ద్వేషం లేదన్నారు. జగన్‌పై నాకున్న అభిప్రాయాన్ని సినిమాగా చెబుతున్నా అని స్పష్టం చేశారు. నా సినిమా వెనుక దాసరి కిరణ్‌ తప్ప ఎవరూ లేరన్నారు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు పిలిచి అగిడినా దర్శకత్వం చేయను అని కరాకండిగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement