Saturday, April 27, 2024

బీడీ కార్మికులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే జాజాల సురేందర్

నాగిరెడ్డిపేట్:-ఆగస్టు13ప్రభ న్యూస్…మండలంలోని మాల్ తుమ్మెద గ్రామ బీడీకార్మికులతో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం మాట్లాడి త్వరలో గ్రామానికి చెందిన బీడీ కార్మికులకు మొదటి విడతగా 60 ఫ్లాట్లు మంజూరు చేసి ఇండ్లు,రోడ్లు మరియు నీళ్ల ట్యాంకులు నిర్మించి ఇస్తానని,ఎవరు అధైర్యపడవద్దు అని,ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించి హామీ ఇచ్చారు.

రానున్న ఎన్నికల్లో మల్లొకసారి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.ఎమ్మెల్యే బీడీకార్మికులకు హామీ ఇవ్వడంతో బీడీకార్మికులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి వెన్నంటి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రతిభ శ్రీనివాస్ రెడ్డి,ఎంపిటిసి పుప్పాల నారాయణ,మండల సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, నాయకులు దుర్గారెడ్డి,నాయి కోటి రవీందర్,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement