Saturday, April 27, 2024

AP: సతీష్ రెడ్డిని సత్కరించిన వైకాపా నాయకులు

పులివెందుల అర్బన్, మార్చి 4 (ప్రభ న్యూస్) : సతీష్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం వేంపల్లికి చేరుకున్న రెండో రోజు ఆయనను పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, జెసిఎస్ ఇన్చార్జులు, పార్నపల్లె కిషోర్, చంద్రమౌళి, కౌన్సిలర్ కోడి రమణలు ఆయనను సోమవారం ఆయన నివాసంలో కలిసి దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 40సంవత్సరాల పాటు వైఎస్ కుటుంబంతో పోటీకి తలబడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై టీడీపీ నుండి వైకాపా పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి, సంపత్, తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement