Monday, May 20, 2024

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య…

పెద్దతిప్ప సముద్రం, (కడప) ప్రభ న్యూస్‌: పురుగుల మందు తాగి రైతు చంద్రశేఖర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీటీ ఎం మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి… పెద్ద తిప్ప సముద్రం మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన ఎం. జయనారాయణ రెడ్డి కుమారుడు రైతు చంద్రశేఖర్‌ రెడ్డి(34) కడుపునొప్పి తాళలేక తమ పొలం వద్ద పురుగుల మందు తాగి బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుబ సభ్యులు గమనించి బాధితుని చికిత్సల నిమిత్తం 108 వాహనంలో హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు అతనికి ప్రథమ చికిత్సలు అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అతన్ని తిరుపతి కి తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటు-ంబ సభ్యులు తెలిపారు. మృతిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీటీఎం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రైతు చంద్రశేఖర్‌ రెడ్డి కి భార్య, కూతురు, కుమారుడు, ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement