Tuesday, May 14, 2024

కడప: నలుగురికి ప్రాణభిక్ష పెట్టిన బిచ్చగాడు

నీటి గుంతలో సరదాగా ఈతకు వెళ్లి మునిగిపోతున్న నలుగురికి ఓ బిచ్చగాడు ప్రాణభిక్ష పెట్టాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లిన కమ్మరపల్లెకు చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా ఈతకొట్టేందుకు శివారులోని ఓ రైల్వే వంతెన వద్దకు వెళ్లారు. అయితే ఇసుక కోసం గోతులు తీసిన గుంతల్లో ఇటీవల భారీ వర్షానికి నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ఐదుగురు విద్యార్థులు సదరు గుంతల్లోకి దిగడంతో కూరుకుపోయారు. ఒడ్డున ఉన్నవారు గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్న బిచ్చగాడు తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా గుంతలోకి దిగి నలుగురిని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు ఆదిత్య ఊపిరాడక మృతి చెందాడు.

కాగా ఇటీవల తన తండ్రి మరణించడంతో ఆదిత్య తల్లితో కలిసి జీవిస్తున్నాడు. తనకు ఉన్న ఒక్క కుమారుడు కూడా మృతి చెందడంతో తల్లి శైలజ కన్నీటి పర్యంతమైంది. ఒక వైపు భర్త.. మరోవైపు కుమారుడు చనిపోవడంతో తనకు దిక్కు ఎవరని ఆమె రోధిస్తోంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనా స్థలానికి చేరుకుని ఆదిత్య మృతదేహాన్ని బయటకు వెలికి తీశారు. నలుగురిని కాపాడిన యాచకుడిని పోలీసులు అభినందించారు.

ఈ వార్త కూడా చదవండి: రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement