Tuesday, May 7, 2024

జూనియర్ ఎన్ టి ఆర్ సీఎం అంటూ.. సుబ్రహ్మణ్య స్వామి భక్తుల హల్ చల్

కుప్పం, (ప్రభ న్యూస్ ): కుప్పం ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్ చల్ చేశారు. తమిళ్ ఆడి మాసం లో పెద్ద ఎత్తున కుప్పం నియోజకవర్గం లో ప్రజలు సుబ్రహ్మణ్యస్వామి కోసం కావడి లు మోస్తారు. ఇందులో భాగంగా కుప్పం మండలంలో చలార్లపల్లి గ్రామంలో ఆడు కృతిక సందర్భముగా ఎన్టీఆర్ బ్యానర్ తో హడావిడి చేస్తూ సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ హల్ చెల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. భారి క్రేన్ లో వీపు లోకి ఇనుప కమ్మి ద్వారా వేలాడుతూ తమ మొక్కుబడులు చెల్లించుకొన్నారు. ఈ క్రమంలో క్రెన్ పైనుండి జూనియర్ ఎన్ టి ఆర్ భారీ ఫ్లెక్సీ చిత్ర పటాని ఊరేగించి ఈ నినాదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement