Sunday, April 28, 2024

Josh in TDP – నారా లోకేష్ తో మేక‌పాటి భేటి…నెల్లూరు రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌…

క‌డ‌ప – వైఎస్సార్ జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను ఉదయగిరికి చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. . టీడీపీలో చేరికపై తన అభిప్రాయాన్ని మేకపాటి లోకేష్ కు వెల్లడించినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఎంట్రీ అయిన తర్వాత టీడీపీలో చేరే అంశంపై లోకేష్ తో మేకపాటి చర్చించినట్లు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిస్దితులపైనా ఆయన లోకేష్ కు వివరించారు.

మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , మేక‌పాటి చంద్ర శేఖ‌ర్ రెడ్డిలు నారా లోకేష్ నెల్లూరులో పాద‌యాత్ర చేసే సంద‌ర్భంగా టిడిపిలో చేర‌నున్నారు.. ఇప్ప‌టికే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఈ విష‌యంపై చంద్ర‌బాబునాయుడితో క‌ల‌సి చ‌ర్చించారు.. ఆనం ఎంపిగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతుండ‌గా, ఆత్మకూరు నుంచి ఆనం కుమార్తె న‌వ్య‌ను పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు..

- Advertisement -

కాగా, టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో టీడీపీకి తిరిగి పునర్వైభవం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు వీరితో పాటు భారీ ఎత్తున ఇతర నేతలు కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. నెల్లూరులో ఈ ముగ్గురు నేత‌లు వైసిపి కి దూరంగా కావ‌డంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కలు అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement