Friday, May 3, 2024

గొప్ప మ‌న‌సున్న మ‌హారాజు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

దివ్యాంగుల పింఛ‌న్ మూడు వేల నుండి 4116కు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎల్ల‌ప్పుడు రుణపడి ఉంటామ‌ని ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కుబీర్ మండల దివ్యంగులు, బీఆర్ ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దివ్యంగుల జీవితాలలో వెలుగులు నింపి మాకు అన్ని రంగాల్లో అవకాశం ఇచ్చార‌న్నారు. మీకు నేను ఉన్నాను అని భరోసానిస్తున్న గొప్ప మనసున్న మహారాజు కేసీఆర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ తుమ్ లక్ష్మిబాయి (తుమ్ రాజేశ్వర్), కుబీర్ మండల EX జడ్పీటీసీ శంకర్ చౌహన్, మండల్ కన్వీనర్ అనిల్, వైస్ ఎంపీపీ మొయిన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పిరజీ, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు దత్తు గౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ డీ.రాములు, మాజీ ఏఎంసీ చైర్మన్ కే.సంతోష్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కే.దిగంబార్ పటిల్, ఎంపీటీసీ లు శ్యామ్ రావు, గంగారావు, సర్పంచ్ లు సురేష్, శ్రీ రాముల రాజేష్, ఉప సర్పంచ్ విక్రమ్ ఉద్దీన్, కుబీర్ బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు నాగలింగం, మాజీ సర్పంచ్ బంక ఆనంద్, సాయబ్ రావు నాయక్, సూది రాజన్న, మాజీ సర్పంచ్ బాబు, వద్నామ్ దత్తు, కళ్యాణ్, బాల ఆనంద్, పండిత్, బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement