Saturday, May 25, 2024

Flash: శ్రీ‌శైలం వెళ్లివ‌స్తుండ‌గా నల్లమలలో జీపు బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు

నల్లమలలో జీపు బోల్తా పడి ఏడుగురు కన్నడిగులకు గాయపడిన ఘటన బుధవారం రాత్రి క‌ర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన 12 మంది ప్రయాణికులు శ్రీశైలం మల్లికార్జున, భ్రమరాంబిక స్వామి వార్లను దర్శించుకుని తిరుగుప్రయాణంలో రాయచూర్ కు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ఆత్మకూరు మండల పరిధిలోని బైర్లూటికి మూడు కిలోమీటర్ల దూరంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో 12 మంది ఉండగా ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement