Tuesday, May 14, 2024

Jagan Cabinet Decisions – అసైన్డ్, లంక భూములపై శాశ్వ‌త హ‌క్కులు … ఆర్ 5 లో ఇళ్ల నిర్మాణం

తాడేప‌ల్లి – వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం అమలుకు జ‌గ‌న్ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.. ఏపీ సీఆర్‌డీఏ లోని ఆర్ 5 జోన్ 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్మాణాల‌కు ఈ నెల 20న జ‌గ‌న్ భూమి పూజ చేయ‌నున్నారు. . ఇక అసైన్డ్, లంక భూములపై హక్కులు కల్పించేలా ఆమోదం తెలిపింది మంత్రి మండలి..ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం మూడున్నర గంటలకు పైగా కొనసాగింది.. మొత్తం 55 అంశాల‌కు ఆమోద ముద్ర వేశారు…

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన 22(A) లో ఉన్న భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగింపుకు ఆమోద ముద్ర పడింది.. యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ఆమోద ముద్ర వేసింది మంత్రి మండలి.. మరోవైపు.. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక పూజారుల‌కు రిటైర్మెంట్ లేని అంశానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అనంతరం మంత్రులతో రాజకీయ అంశాలపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్‌ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. అద్భుతమైన ఫలితాలపై సీఎం వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేసినట్లు స‌మాచారం . ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అంటూ.. వారిపై ప్రశంసలు కురిపిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారనే స‌మాచారం త‌న వ‌ద్ద ఉంద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. వ‌చ్చే ఏన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement