Wednesday, May 8, 2024

ఎమ్మెల్సీకి ఇందుకూరి తొలి నామినేషన్‌..

విజయనగరం, (ప్రభ న్యూస్‌) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్ధి ఇందుకూరి రఘురాజు తొలి నామినేషన్‌ వేసారు. రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ జీసీ కిషోర్‌కుమార్‌ వద్ద శనివారం ఆయన నామపత్రాన్ని సమర్పించారు. నామ పత్రాన్ని, డి.ఫారం, ప్రతిపాదించిన వారి వివరాలను ఓటర్ల జాబితాలో పేర్లున్నదీ లేనిదీ రిటర్నింగ్‌ అధికారి పరిశీలించారు. అనంతరం అభ్యర్ధి రఘురాజుతో ప్రమాణ పత్రాన్ని చదివించారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎం. గణపతిరావు, ఎస్‌కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎస్‌కోట వైస్‌ ఎంపీపీ ఇందుకూరి సుబ్బలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement