Wednesday, May 22, 2024

Indrakeeladri – జగన్మాత సేవలో తమిళనాడు మాజీ సీఎం పలనీస్వామి

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న జగన్మాత సేవలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పలని స్వామి పాల్గొన్నారు. బుధవారం ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించేందుకు వచ్చి వచ్చిన తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేయగా, అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్ని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో భ్రమరాంబలు అందజేశారు. ఈ సందర్భంగా పళనిస్వస్వామి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవిత్రమైన ఆలయంలో రాజకీయాలు మాట్లాడనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement