Friday, May 3, 2024

Bangalore: బ‌స్సును ఢీకొన్న కారు.. నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల దుర్మరణం

బెంగళూరు: బస్సును కారు ఢీకొనడంతో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల దుర్మరణం పాలైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు- మైసూరు హైవేపై నాగమంగళ సమీపంలో అక్కడి బస్టాండ్‌ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. మృతులంతా బెంగళూరుకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement