Monday, May 6, 2024

హ‌త్య‌కేసులో పోలీసుల పురోగ‌తి

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరులో అర్థరాత్రి జరిగిన యువకుడి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి, అదుపు లోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు స‌మాచారం. హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించిన అనంత‌రం నూజివీడు డీఎస్‌పీ శ్రీనివాసులు అధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేప‌ట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆప‌రేష‌న్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. భీమరాజు,ఎస్ఐలు సిహెచ్ దుర్గాప్రసాద్, కిషోర్ వి సతీష్, ఎం.లక్ష్మణ్, ఏ. పద్మారావు, సుబ్రహ్మణ్యం లు క్రియాశీలకంగా వ్యవహరించారు.. ఈ సాయంత్రం నిందితులను మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement