Sunday, May 5, 2024

ఐఐటీ విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతం.. విశాఖ ఆర్కే బీచ్ లో మృత దేహం

సంగారెడ్డి / విశాఖ – ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ ఐఐటీ స్టూడెంట్ చివరికి బీచ్ లో శవమై తేలాడు. హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ నుంచి వెళ్లిన కార్తీక్ అనే విద్యార్థి విశాఖ ఆర్కే బీచ్ లో ఈ రోజు శవంగా తేలాడు.

సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ నెల 17న క్యాంపస్ నుంచి బైటికి వెళ్లిన కార్తీక్ ఆచూకీ కోసం పోలీసులు, తల్లిదండ్రులు తీవ్రంగా గాలిస్తున్నారు. చివరిసారిగా అతను శేరిలింగంపల్లి రేల్వేస్టేషన్ సీసీ ఫుటేజ్ లో కనిపించాడు. అక్కడినుంచి విశాఖ ట్రైన్ ఎక్కినట్టుగా గుర్తించారు. కాగా, నల్గొండ జిల్లా మిర్యాల గూడా కార్తీక్ స్వస్థలం.

Advertisement

తాజా వార్తలు

Advertisement