Thursday, May 9, 2024

Manipur Roits – రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు నిరసన

న్యూ ఢిల్లీ -పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ‘మణిపుర్‌ అల్లర్ల’ అంశం కుదిపేస్తోంది. మణిపుర్‌ పై ప్రధాని మోడీ ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాల కూటమి పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడం మరింత దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ సహా ‘ఇండియా (విపక్ష కూటమి)’ సభ్యులు సోమవారం రాత్రి 11 గంటలకు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. సస్పెన్షన్‌ వేటు పడిన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాత్రంతా వీరు నిరసన కొనసాగించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement