Wednesday, May 1, 2024

Srikakulam: పడవ బోల్తాపడి.. మత్యకారుడు మృతి

సోంపేట, జులై 25 (ప్రభ న్యూస్) : సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఇసకలపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం వేకువజామున 4 గంటలకు ఇసకలపాలేనికి చెందిన ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ క్రమంలో పడవ బోల్తా పడటంతో గంట జనార్దన (40) సముద్రంలో పడి మృతిచెందగా.. బైపల్లి తులసయ్య గల్లంతయ్యారు. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

జనార్దనను కాపాడేందుకు తోటి మత్స్యకారులు విఫలయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గల్లంతైన తులసయ్య కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఆయన మరో పడవను ఆశ్రయించి ఒడ్డుకు చేరినట్లు తెలుస్తోంది. గంట జనార్దన మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్ సోంపేట ఎం పి పి డాక్టర్ ఎన్ దాసుతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు బారువ ఎస్ఐ చిరంజీవితో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement