Friday, April 26, 2024

రాష్ట్రాన్ని విడ‌దీస్తామంటే తోలు తీస్తా… ప‌వ‌న్ క‌ళ్యాణ్

రాష్ట్రాన్ని విడ‌దీసి ముక్క‌లు చేస్తామంటే తోలు తీస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జనసేన ముఖ్యనేతలు, జనసైనికులు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ… స‌న్నాసులతో విసిగిపోయామ‌న్నారు. ఓట‌మి క‌న్నా నాకు అవ‌మానం ఇంకేం జ‌ర‌గాల‌ని అన్నారు. మీరు జ‌న‌సేన వెంట నిల‌బ‌డండి.. రాష్ట్ర భ‌విష్య‌త్తు బాగుంటుంద‌న్నారు.

ముసలినేతలు మాట్లాడే వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దన్నారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా మీకు అని అన్నారు. ఏపీ భవిష్యత్తు బాగుండాలి, వ్యూహం నాకు వదిలేయండి అని అన్నారు. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నారు. మీరు వేలకోట్లు దోచేశారన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా దోచేశారని అన్నారు. మీరు మాతో గొడవ పెట్టుకోండి.. అప్పుడు చెబుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. దండయాత్ర చేద్దాం.. వాళ్లకు ఇంకా మదం ఎక్కనీ అన్నారు. మీరు రాష్ట్రాన్ని విడగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement