Sunday, May 5, 2024

పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న శ‌ర్వానంద్.. వైర‌ల్ గా ఎంగేజ్ మెంట్ ఫొటోలు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లో ఒక‌రైన హీరో శ‌ర్వానంద్ తర్వలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. శర్వానంద్ కు నిశ్చితార్థం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.వీరి నిశ్చితార్థానికి మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు , అలాగే పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. శర్వాకు కాబోయే భార్య పేరు రక్షిత రెడ్డి, హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కూతురు. త్వరలోనే రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు శర్వా. ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రక్షితారెడ్డితో శర్వానంద్‌కి నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. శర్వానంద్‌-రక్షితారెడ్డి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటికి వచ్చాయి. మేడ్ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్న ఈ జంట ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement