Saturday, May 4, 2024

కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) బృందం సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. ఈ బృందం ఆనందయ్య నాటు మందు శాస్త్రీయతను పరీక్షించిన తర్వాతే తిరిగి పంపిణీ జరిగే అవకాశం ఉంది.

కరోనాకు ఆనందయ్య ఇస్తున్న నాటు మందుపై అనుమానాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్ శుక్రవారం(మే 21) అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని అధికారులకు సూచించారు. అధ్యయనం కోసం ఐసీఎంఆర్ బృందాన్ని కృష్ణపట్నం పంపించాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement