Friday, May 3, 2024

ఢిల్లీలో లాక్​ డౌన్​ ను ఎత్తేస్తాం: కేజ్రీవాల్​

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. కొత్తగా కేవలం 1,600 కేసులే నమోదయ్యాయి. కేవలం నెల రోజుల్లోనే 29 వేల నుంచి 2 వేల లోపుకు దిగొచ్చాయి. కేసులు పెరిగిపోతుండడంతో వెంటనే లాక్ డౌన్ విధించిన ఢిల్లీ సీఎం.. ఫలితం రాబట్టారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 2.5 శాతం కన్నా తక్కువే నమోదైందని తెలిపారు సీఎం కేజ్రీవాల్. కేసులు భారీగా తగ్గుతున్నాయని, ఇంకో వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తామని చెప్పారు. ప్రస్తుతం మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని, అందరి ఏకాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని స్పష్టం చేశారు.

కరోనాతో పోరు ఇంకా అయిపోలేదని కేజ్రీవాల్ చెప్పారు. మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. త్వరలోనే 2 కోట్ల మందికి టీకాల కోసం చర్యలు చేపడతామన్నారు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement