Sunday, May 19, 2024

వైసీపీ లాంటి పార్టీని జీవితంలో చూడలేదు.. చంద్రబాబు

నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని చూడలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. నిన్న ఒక్కరోజే జరిగిన ఐదు సంఘటనలు చూసి బాధేసిందన్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన కిషన్ శవమై తేలారన్నారు. నాసిరకం మద్యం తాగి ముగ్గురు చనిపోయారన్నారు. అన్ని జిల్లాల్లో రౌడీయిజం పరాకాష్టకు చేరిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement