Thursday, May 2, 2024

Breaking: టీడీపీ వర్సెస్ వైసీపీ.. నూజివీడులో హైటెన్షన్ వాతావరణం

కృష్ణా జిల్లా నూజివీడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నూజివీడు నలువైపులా ప్రత్యేక పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రెడీ అంటూ వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరు కాలుదువుతున్నారు. ఇరు రాజకీయ పార్టీల నాయకుల సవాళ్ళతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. భారీ పోలీస్ బలగాల మోహరింపుతో నూజివీడు రాజకీయం వేడెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement