Tuesday, April 30, 2024

రాయలసీమ ఆత్మగౌరవ సభ

మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌ని రాయ‌ల‌సీమ విద్యార్థి, యువ‌జ‌న జేఏసీ ఆధ్వ‌ర్యంలో కర్నూలులో రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈస‌భకు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువ‌జ‌నులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా నేత‌లు మాట్లాడుతూ… రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామ‌న్నారు. అలాగే మూడు రాజధానుల బిల్లు తిరిగి ప్రవేశపెట్టకుంటే సీఎం జగన్ ఇల్లు కూడా ముట్టడిస్తామ‌ని జేఏసీ నేత‌లు హెచ్చరించారు. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తేనే చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయాలని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన రాయలసీమ నేతల ఇళ్లకు గాజులు, చీరలు పంపుతామ‌ని నేత‌లు పేర్కొన్నారు. ఒకప్పుడు మేం రాజధానిని కోల్పోయాం..ఇప్పుడు కర్నూలుకు ప్రకటించిన హైకోర్టును పోగొట్టుకోమంటూ నినదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement