Saturday, May 4, 2024

ప్రతాపం చూపుతున్న వరుణుడు.. బుడమేరుకు వ‌ర‌ద పోటు

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో – ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.మైలవరంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెడ్డిగూడెం మండలంలో వరద ఉధృతికి ఓబులాపురం,నరుకుళ్ళపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడులో వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.

అదే విధంగా జి.కొండూరు మండలం సున్నంపాడు వద్ద రోడ్డు వరద ప్రవాహానికి గండి పడింది.సున్నంపాడు,తెల్లదేవరపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.వరద ఉధృతి కి రోడ్ల పై ప్రవహిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement