Tuesday, May 14, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఏపీలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అమృతలూరు మండలం దేవాడకు చెందిన నక్కా వసంత రావు, విజయ్‌, పోతరాజు ద్విచక్రవాహనంపై చెరుకుపల్లికి వచ్చి స్వగ్రామానికి బయలు దేరారు. తెనాలి రోడ్డులోని కోత మిషన్‌ వద్ద గడ్డి మిషన్‌ను తీసుకెళ్తున్న టైర్‌ బండిని ఢీ కొట్టారు. ద్విచక్రవాహనం మధ్యలో కూర్చున్న వసంతరావు అక్కడికక్కడే చనిపోగా, బైక్‌ నడుపుతున్న విజయ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చున్న పోతరాజు తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రోడ్డు ప్ర‌మాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement