Tuesday, May 7, 2024

యాసంగి వడ్ల కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నిరసన

యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పార్టీ నేతలు నిరసన దీక్ష చేశారు. బస్టాండ్ ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వడ్లను బేషరత్ గా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చెట్టు పెళ్లి మురళీధరరావు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement