Monday, April 29, 2024

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి: కాంగ్రెస్ డిమాండ్

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ అన్నారు. సోమవారం కొమ్ములవంచ గ్రామ శివారులో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్ అధికారి పాండు నాయక్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం గృహావసరాల విద్యుత్ చార్జీలను పెంచడంతో మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం పడిందన్నారు. వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో ధర్నాలు,రాస్తారోకోలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement