Wednesday, May 1, 2024

రేప‌టి నుంచి ఎల్ వి ఆర్ లో బిలియర్డ్స్, స్నూకర్ ఛాంపియన్ షిప్ టోర్ని…

గుంటూరు స్పోర్ట్స్, ఎల్ వి ఆర్ అండ్ సన్స్ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బిలియర్డ్స్, స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలను రేప‌టి నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎల్ వి ఆర్ అండ్ సన్స్ క్లబ్, రీడింగ్ రూమ్ కార్యవర్గ అధ్యక్షుడు మైనేని రాంప్రసాద్ తెలిపారు. స్థానిక కొరిటెపాడులోని ఎల్ వి ఆర్ అండ్ సన్స్ క్లబ్, రీడింగ్ రూమ్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైనేని రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే ఎ. పి. స్టేట్ ర్యాంకింగ్ బిలియర్డ్స్, స్నూకర్ ఛాంపియన్ షిప్ – 2021 పోటీలను ఎ. పి. బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్లబ్ ఆద్వర్యంలో నిర్వహించిన గత టోర్నమెంట్ లలో అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు ప్రముఖ బిలియర్డ్స్ క్రీడాకారుడు గీత్ సేథీని గుర్తు చేసుకున్నారు. సమావేశంలో బిలియర్డ్స్ టోర్నమెంట్ ఇన్ ఛార్జ్ వి. పురుషోత్తం మాట్లాడుతూ ఈ నెల 27 నుండి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే బిలియర్డ్స్, స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఇప్పటికీ 170 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. క్లబ్ నుండి కూడా ముగ్గురు సీనియర్ క్రీడాకారులు తమ ఎంట్రీలను అందజేశారు తెలిపారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు స్నూకర్ క్రీడాకారులు, ఇద్దరు బిలియర్డ్స్ క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. పోటీలకు ప్రారంభోత్సవ కార్యక్రమం క్లబ్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ చేతుల మీదుగా జరుగుతుందని తెలిపారు. సమావేశంలో బిలియర్డ్స్, స్నూకర్ ఛాంపియన్ షిప్ – 2021 బ్రోకర్ ను విడుదల చేశారు. సమావేశంలో బిలియర్డ్స్ సీనియర్ క్రీడాకారుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement