Saturday, May 4, 2024

ఇంటర్ పరీక్షలు యధాతధం – బోర్డు అధికారిక ప్రకటన

కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలన్ని మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా పరీక్షలు జరుగుతాయా.. జరగవా అనే ఆలోచనలో పడ్డారు స్టూడెంట్స్. కాగా ఇదే విషయమై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయని తెలిపింది. మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనుండగా.. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది.

జాతీయ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో ఇంటర్పరీక్షల నిర్వహణకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనీ కొంత మంది డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement