Friday, April 26, 2024

హ‌క్కుల సాధ‌న‌కు స‌ర్పంచ్ ల పాద‌యాత్ర‌..

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలో సర్పంచులు త‌మ హక్కుల సాధనకు పాద‌యాత్ర చేప‌ట్టారు. వట్టిచెరుకూరు మండల కేంద్రం నుంచి గుంటూరు జిల్లా కేంద్రానికి సర్పంచులు పాదయాత్రగా బ‌య‌లుదేరారు. ప్ర‌త్తిపాడు నియోజకవర్గంలోని సర్పంచులు వట్టిచెరుకూరులో బయలుదేరి కాట్రపాడు, చమళ్లమూడి, వింజనంపాడు గ్రామాల మీదగా ఏటుకూరులను కలుపుతూ గుంటూరు నగరానికి చేరుకుని అక్కడ జిల్లా కలెక్టరు వినతిపత్రం సమర్పిస్తామని కాట్రపాడు సర్పంచి మేదరమెట్ల శంకర్ తెలిపారు. గౌరవ వేతనం రూ.3 వేల నుంచి రూ.15 వేలకు పెంపు, సచివాలయాలను సర్పంచుల ఆదీనంలోకి తేవడం వంటి రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకు ఈ కార్యక్ర మాన్ని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement