Saturday, April 20, 2024

బ్యాట్ ప‌ట్టిన త్రివిక్ర‌మ్.. వైర‌ల్ గా వీడియో

బ్యాట్ ప‌ట్టారు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్. అది కూడా షూటింగ్ టైంలో..షూటింగ్ కి విరామం దొర‌క‌డంతో త‌న సిబ్బందితో క‌లిసి క్రికెట్ ఆడారు ఈ స్టార్ డైరెక్ట‌ర్. సూపర్ స్టార్ మహేశ్ బాబు, పూజ హెగ్డే జంటగా ఎస్ఎస్ఎంబీ 28తెర‌కెక్కుతోంది.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. వచ్చే ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఎస్ఎస్ఎంబీ 28 సెట్స్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వ బాధ్యతలను కొంచెసేపు పక్కన పెట్టి క్రికెటర్ గా మారారు. సెట్స్ లోనే బ్యాటు పట్టి క్రికెట్ ఆడారు. షూటింగ్ బ్రేక్ టైంలో మిగతా వారితో కలిసి సరదాగా ఆయన క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రంగస్థలం మహేశ్ ను కూడా చూడవచ్చు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement