Friday, May 10, 2024

ప్రత్తిపాడు మండల సర్వ సభ్య సమావేశం

ప్రత్తిపాడు ఫిబ్రవరి 21 (ప్రభ న్యూస్): నియోజవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండల సర్వ సభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి అన్నమ్మ అధ్యక్షతన జరిగినది.సర్వసభ్య సమావేశమునకు మండల స్థాయి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలుపరుస్తున్న రైతు భరోసా కేంద్రాలపై ప్రజా ప్రతినిధులు అడిగిన వివరాలకు సమాధానం చెబుతూ అగ్రికల్చర్ ఏఈ అరుణ కుమారి సరిపడినంత పర్మినెంట్ ఉద్యోగస్తులు లేకపోవడం వలన రైతు భరోసా కేంద్రాలు నడపలేక పోతున్నామని చెప్పడం గమనార్హం.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ రమ్య, జడ్పిటిసి విపాలకృష్ణారెడ్డి,వక్ బోర్డ్ చైర్మన్ జిలాని,మండలంలోని ఎంపీటీసీలు,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement