Tuesday, May 21, 2024

గృహ సారధులె జగనన్న ప్రభుత్వ రథసారథులు – మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు రూరల్( ప్రభా న్యూస్ )ప్రత్తిపాడు నియోజకవర్గ గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ని డబ్బురి కల్యాణ మండపంలో నిర్వహించిన సచివాలయ వాలంటీర్లు, కన్వీనర్లు , గృహ సారధుల ముఖ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ హోం శాఖ మాత్యులు ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సుచేత మాట్లాడుతూ రానున్న 2024 ఎలక్షన్స్ లో జగనన్న చేసిన సంక్షేమ పథకాలన్నిటిని ప్రజలకు తెలియపరచవలసిన ముఖ్య బాధ్యత మీ అందరిపై ఉందని, జగనన్న విజయానికి మీరే నాంది పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మండల జడ్పిటిసి సభ్యులు తుమ్మల సుబ్బారావు , మండల వైఎస్ఆర్సిపి నాయకులు ఇంద్ర , గుంటూరు రూరల్ మండలం కన్వీనర్ ఆళ్ల రవి దేవరాజు, చల్లవారిపాలెం సర్పంచ్ ఆరుదల సాంబశివరావు, గొర్ల వారి పాలెం సర్పంచ్ నల్ల మేకల అప్పమ్మ మాధవరావు, మల్లవరానికి చెందిన జగన్మోహన్ రెడ్డి, తురకపాలెం సర్పంచ్ డబ్బురి సూర్యప్రకాశరావు, మెట్టు వెంకటప్ప రెడ్డి, జొన్నలగడ్డ సర్పంచ్ మబ్బు శిరీష సుధాకర్, సచివాలయ మండల కన్వీనర్ ఎదురుపాక వెంకట్ , ఈ కార్యక్రమానికి గుంటూరు రూరల్ మండల సర్పంచులు ,ఎంపీటీసీ సభ్యులు నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement