Monday, April 29, 2024

పోతుల సునీత పద్మశాలీ కాదు : జగ్గారపు శ్రీనివాసరావు

మంగళగిరి : సీటివ్వని చోట పద్మశాలీలను బరిలో ధింపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీయ సంఘం అధ్యక్షులు జగ్గరపు శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నగరంలోని IBN ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.18 శాతం ఉన్న పద్మశాలీలకు ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా ఇవ్వలేదని పోతుల సునీత పద్మశాలి కాదని అన్నారు. 26 నియోజకవర్గాల్లో పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారని ఒక్కో రాజకీయ పార్టీ 12 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏదైనా ఒక పార్టీ సీటిచ్చి మిగిలిన వారు ఇవ్వకపోతే ఆ ఒక్క అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. ఇక మౌనం వహించేది లేదని ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement