Monday, May 6, 2024

చీటీ డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి సిటీ ఫిబ్రవరి 22 (ప్రభ న్యూస్): చీటీ డబ్బులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి వేధిస్తున్న చీటీ నిర్వాహకుల తీరుతో మనస్థాపం చెందిన‌ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ ఎస్విపి కాలనీ చెందిన నితిన్ సింగ్, స్థానికంగా ప్రొవిజన్ దుకాణం పెట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో తన అవసరాల కోసం ఇంటి పరిసర ప్రాంతాల్లో నమ్మకంగా చీటీలు నిర్వహిస్తున్న వాణి, ఆమె భర్త ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామి అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకులు వద్ద చీటీలు వేశారు.

చీటీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నా తనకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా దంపతులిద్ద‌రూ రోజురోజుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వక‌పోవడంతో విసిగి మనస్థాపం చెంది.. తన చావుకు చీటీ నిర్వహిస్తున్న దంపతులే కారణం అంటూ లేఖ రాసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్ వి మెడికల్ కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్నాథరెడ్డి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement