Sunday, April 28, 2024

లైంగిక వేధింపు కేసుల‌కు ఫోక్సో కోర్టు ద్వారా న్యాయం : హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ రావు

తెనాలిలో నూతనంగా ఏర్పాటైన‌ ఫోక్సో కోర్టును హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, సహచరులు, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డిలు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ.. బాలికలపై జరిగే లైంగిక వేధింపులు దాడులకు సంబంధించిన కేసులలో ఈ కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం చేస్తున్న చట్టాలను వినియోగించుకొని బాలికలు స్వేచ్ఛ జీవితాన్ని గడపాలని కోరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు జడ్జిలు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement