Saturday, May 4, 2024

కబరస్థాన్ కి స్థలం కేటాయించండి…

దుగ్గిరాల – నూర్ భాషాలకి స్మశాన వాటి్క కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర ఎంబిసి అధ్యక్షులు ఆకుమళ్ళ నానిని కోరారు నూర్ భాష ప్ర‌తినిదులు…మండలం పరిధిలోని మోరంపూడికి చెందిన పలువురు రాష్ట్ర ఎంబిసి కార్యాలయంలో నానిని కలిసి వారి సమస్యలను వివరించారు.ఎన్నో ఏళ్ళ నుంచి గ్రామములో నూర్బాషలు కాలం చేస్తే స్మశాన స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని వారు వివరించారు. దీనిపై నానీ స్పందించి విషయంపై మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామ కృష్ణా రెడ్డి దృష్టికి తీసుకొని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.. .ఈ సందర్బంగా ఆకుమళ్ళ నానిని నూర్ భాషాలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సలీం, గౌరవ సలహాదారులు షేక్ బాష, శ్రీను బాష,నాగులు మీరా,సుభాని,రాజా వలి గోపి,మణి బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement