Saturday, May 11, 2024

కరోనా టీకాపై ప్రజలు అపోహలు వీడండి – ఎమ్మెల్యే నంబూరు శంకరరావు…

అమరావతి , ప్రజలు కరోనా టీకాపై అపోహలు వీడాలని, 60 సంవత్సరాలు దాటిన వారు, 45-60 సంవత్సరాల మధ్య ఉండి దీర్ఘ కాలిక వ్యాధులతో ఉన్న వారికి కోవిడ్ టీకా వేయించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు, గురువారం మండలములోని ఎండ్రాయి గ్రామంలో సర్పంచ్ నాయుడు రాంబాబు అధ్యక్షతన అత్తలూరు పి.హెచ్.సి వైద్యాధికారిణి కే శ్రీ జ్యోతి పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ 60సంవత్సరాలు దాటిన వారు, 45-60 సంవత్సరాల మధ్య వారు ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సినేషన్ పై వస్తున్న అపోహలు వీడాలని అని అన్నారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జీ యమ్మార్వో భవాని శంకర్, పి.హెచ్.సి సిబ్బంది, ఆశ వర్కర్స్, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మేకల హనుమంతు రావు, వైసీపీ నాయకులు చిలకా సాంబయ్య , నాయుడు సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement