Sunday, April 28, 2024

ప్రజలకు సేవలు చేయడంలో బీజేపీ ముందుంటుంది – కన్నా

గుంటూరు సిటీ గుంటూరు నగరంలో ఎండ తీవ్రంగా ఉందని రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం దాల్చిందని నిపుణులు అంటున్నారు అని నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు వారికి సేవలు చేయడానికి బిజెపి ముందుంటుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని బ్రాడిపేట,బృందావన్ గార్డెన్స్,కొరిటపాడు,పట్నం బజార్ నందు అదేవిధంగా దేచిరాజు వెంకట్రావ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దేచిరాజు సత్యంబాబు ఆధ్వర్యంలో బ్రాడీపేట నందు మంచినీటి చలివేంద్రములను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఈరోజు వల్లూరు జయప్రకాష్ నారాయణ మరియు దేచిరాజు సత్యంబాబు మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నానాన్నారు.
కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన ప్రజల అవసరాల రీత్యా నిరంతరం ప్రజాసేవలో ఉండే పార్టీ అని రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఉండే పార్టీ బీజేపీ అని ఆసందర్భంగా నరేంద్రమోడీ స్ఫూర్తితో ఎండ వేడిమి నుండి నగర ప్రజల దాహార్తిని తీర్చాలనే తలంపుతో నగరంలో ఈరోజు పలుచోట్ల మంచినీటి చలివేంద్రములు కన్నా లక్ష్మీనారాయణ చేతులమీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులుపాటిబండ్లరామకృష్ణ,దేచిరాజు సత్యంబాబు,పాలపాటి రవికుమార్,ఉయ్యాల శ్యాంవరప్రసాద్,నీలంప్రసాదు,అనుమోలు ఏడుకొండలు గౌడ్,కుమార్ గౌడ్,పాలిశెట్టిరఘు,ఈదరశ్రీనివాసరెడ్డి,ఇండ్లపాండురంగారావు,జితేంద్రగుప్తా,బాబీ,మల్లాల లక్ష్మణ్,సాధు రామకృష్ణ,దేసుసత్యనారాయణ,దినేష్,బుల్లిబాబు,ఆవులవెంకటేశ్వరరావు,నరసింహమూర్తి,శశాంక్ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement