Monday, May 6, 2024

ప్రజా సమస్యలపై సంతకాల సేకరణ..

కవాడిగూడ : గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వివిధ బస్తీలలో నెలకొన్న ప్రజా సమస్యలపై హక్కు ఇనిషియేటివ్‌ సంస్థ ప్రతినిధులు శేఖర్‌, ఖుర్షిద్‌, అక్బర్‌, సాయిసుమంత్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గం కవాడిగూడ మున్సిపల్‌ డివిజన్‌లోని ఇందిరాపార్కు, దోమలగూడ, ఎల్‌ఐసి కాలనీ త దితర ప్రాంతాలలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెరుగైన వైద్యం, కాలుష్య సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకోసం బస్తీ దవాఖానాలు పెంచాలని స్థానికులు కోరుతున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానాలలో మందులు ఏర్పాటు చేయాలని, పరిసరాలను శుభ్రంగా పెట్టాలని వారు కోరారు. ఎక్కడపడితే అక్కడ చెత్త, మట్టికుప్పలు మురుగునీరు నిలిచి ఉండడం వల్ల ఈగలు, దోమలు వ్యాపించి ఆనారోగ్యాల భారీన పడే ప్రమాద ం ఉందని, అందుకు చర్యలు చేపట్టాలని కోరడం ప్రతి ఒక్కరి హక్కు అని వారు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement