Sunday, April 28, 2024

రైతుల గోడు ప‌ట్ట‌దా..? : ఎమ్మెల్యే గోరంట్ల‌ బుచ్చ‌య్య‌చౌద‌రి

వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలు ప్ర‌భుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు క‌ష్ట‌ప‌డి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాల‌ని నాయ‌కుల చేతులు త‌డ‌పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు. ఆర్బీకేలో కమీషన్ ఏజెంట్లు ఉన్నారని.. చేయి తడిపితేనే పంట అమ్ముకోగలమని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్బీకే భవనాలు ఎక్కడా నిర్మాణం కాలేదన్నారు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement