Wednesday, April 24, 2024

త్వరలో ఎయిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు.. మంత్రి విడదల రజని

ఎయిమ్స్ లో త్వరలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తెస్తామని ఏపీ మంత్రి విడదల రజని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ ను మంత్రి సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ఎయిమ్స్ కు జగన్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉందన్నారు. ఎయిమ్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం రూ.55కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎయిమ్స్ కోసం చంద్రబాబు చేసింది శూన్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement