Monday, May 13, 2024

ద‌క్షిణాదిలో.. చెన్నై-మైసూర్ వందే భార‌త్ ట్ర‌య‌ల్ ర‌న్..

ద‌క్షిణాదిలో చెన్నై-మైసూర్ మ‌ధ్య తొలి వందేభార‌త్ ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభించారు. ఈ ట్ర‌య‌ల్ ర‌న్‌ చెన్నైలోని ఎంజీ రామ‌చంద్ర‌న్ సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్‌లో సోమ‌వారం ప్రారంభించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ద‌క్షిణాదిన తొలిసారిగా న‌వంబ‌ర్ 11న ప‌ట్టాలెక్క‌నుంది. ఈ ట్రైన్ చెన్నై సెంట్ర‌ల్ నుంచి బ‌య‌లుదేరి బెంగ‌ళూర్ సిటీ జంక్ష‌న్ మీదుగా తుది గ‌మ్య‌స్ధానం మైసూర్‌కు చేరుకుంటుంది. మొత్తం 497 కిలోమీట‌ర్ల దూరాన్ని ఈ ట్రైన్ 6 గంట‌ల 40 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ లో అత్యాధునిక టెక్నాల‌జీతో కూడిన వ‌స‌తులు క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని, ఆటోమెటిక్ డోర్స్, వినోదం పంచేందుకు ట్యాబ్‌, ఇలా ఎన్నో వ‌స‌తులను ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement